HNK: భారతదేశంలో అన్ని మతాలను, కులాలను గౌరవించే సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండ అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికార మధంతో మాట్లాడుతున్నారని అన్నారు.