ADB: నార్నూర్ మండలంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 7 గంటలకు ముగిసింది. గ్రహణ సమయంలో సంప్రదాయాల ప్రకారం మండలంలోని పలు ఆలయాలను మూసివేశారు. భక్తులు కూడా ఇళ్లలోనే పూజలు నిర్వహించారు. గ్రహణం ముగిసిన వెంటనే శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ద్వారాలను తిరిగి తెరిచారు. భక్తుల రాకపోకలతో ఆలయాలు మళ్లీ సందడిగా మారాయి.