NRML: జిల్లాలోని 30 గ్రామాలను ఆరెంజ్ జోన్లో చేర్చినట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలో అత్యధికంగా 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 40 డిగ్రీలకు పైన ఉన్న గ్రామాలను అధికారులు ఆరెంజ్ జోన్లో ప్రకటించారు. ఇది వరకు జిల్లాలోని ఐదు గ్రామాలు రెడ్ జోన్లో సైతం ఉన్న విషయం తెలిసిందే.