MDK: శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామున ఆలయ అర్చకులు మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.