NZB: ధర్పల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో లక్ష్మారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీవో రాజేశ్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.