JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఈనెల 23న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మార్క్ఫెడ్ డీఎం రంజిత్ రెడ్డి ఇవాళ తెలిపారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్దతు ధర క్వింటాల్కు రూ.2400గా నిర్ణయించగా, తేమ శాతం 14లోపు ఉండాలని తెలిపారు. రైతులు దళారులకు నమ్మవద్దని సూచించారు.