BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వేగవంతమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 25న జరగనున్న ద్వజారోహణం కోసం ధ్వజస్తంభానికి ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. విద్యుత్తు దీపాలు, పుష్ప మాలికలతో మెరిసిపోతున్న ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.