ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ వస్తున్న వార్తలను వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఖండించారు. నిరుపేదలపై పోలీసులు దాడులు చేశారనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు కూడా కనిపించని లాఠీచార్జ్ ఘటనను జరిగినట్లుగా ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.