JGL: ఇబ్రహీంపట్నం మండలంలో మొక్కజొన్న పంటను జంతువుల బారి నుంచి రక్షించుకోవడానికి అన్నదాతలు పంట చుట్టు చీరలను ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే పంటలపై అడవి పందులు, కోతులు దాడి చేసి పంటను ధ్వంసం చేస్తాయి. రైతులు చీరలను ఏర్పాటు చేయడం ద్వారా అడవి జంతువులు భయపడి పంటల వద్దకు రావడం లేదని తెలిపారు. ఇందుకు పాత చీరలను రైతులు కొంటున్నారు.