HYD: హోలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు తీసుకోవాలని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వారిపై బలవంతంగా రంగులు చల్లడం నిషేధమని, బహిరంగ ప్రదేశంలో పాదాచారులు, వాహనదారులపై రంగులు వేయొద్దన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ-టీమ్స్ నిఘా ఉంచాలన్నారు.