GDWL: ప్రజలు ఆర్టీసీ సేవలు సౌకర్యాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చి మరిన్ని సేవలు పొందాలని గద్వాల డిపో మేనేజర్ సునీత కోరారు. ఆర్టీసీ సేవలపై అభిప్రాయాలు స్వీకరించేందుకు ఈనెల 19న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె సోమవారం తెలిపారు. ఈనెల 19న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ ద్వారా ప్రయాణికులు తమ సలహాలు తెలియజేయాలన్నారు.