HYD: సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని బాచుపల్లి ప్రాంగణంలో భాషాశాస్త్ర శాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా భాషాభివృద్ధి పీఠం డీన్ డా.K.రత్నశ్రీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సౌత్ జోన్ క్రికెట్కు ఎంపికైన వినోద్ను ఘనంగా సన్మానించారు. అధ్యాపకులు చంద్రయ్య, పవన్ పాల్గొన్నారు.