ADB: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ మండలంలోని వేణునగర్ కాలని, లక్కారం గ్రామాలలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.