KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.15,075, నాన్ ఏసీ మిర్చి రూ. 8,000, అటు క్వింటా పత్తి ధర రూ. 7000గా జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.175 పెరగగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గింది. అటు పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.