ఖమ్మం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కేంద్ర మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలు సరికావని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భట్టి, మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.