SRCL: వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో బుధవారం స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. గత 8 నెలల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, ఆలయానికి మొత్తం రూ.6,07,481 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.