BDK: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఈనెల 4న నెహ్రూ బస్తీకి చెందిన నరేష్పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, ఉదయ్, రాజేశ్వరరావు రోకలిబండతో దాడి చేసినట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను కొత్తగూడెం-1 టౌన్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్థలం విషయంలో గొడవ జరిగినట్లు తెలిపారు.