SDPT: కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని తిమ్మారెడ్డిపల్లి, మంగోల్ గ్రామాలలో భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొగుట సీఐ, ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాల నియంత్రణకు ఇవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.