BHPL: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మహాముత్తారం BJP మండల అధ్యక్షుడు పూర్ణచందర్ విమర్శించారు. ఇవాళ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కేవలం రెండు సార్లు మాత్రమే రైతు భరోసా విడుదల చేసినట్లు తెలిపారు. వెంటనే రైతు బంధును విడుదల చేయాలన్నారు.