SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజన్న స్వామికి ప్రీతికరమైన కోడె మొక్కులతో పాటు, భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. “అందరినీ చల్లగా చూడు రాజన్నా” అంటూ భక్తజనం వేడుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.