ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాలలో మంగళవారం భవిత సెంటర్ను మండల విద్యాధికారి పవార్ అనిత ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వికలాంగులైన విద్యార్థులకు వీల్ ఛైర్, వినికిడి యంత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం తరపున అనేక ఉచిత సౌకర్యాలను అందుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.