BDK: దుమ్ముగూడెం మండలం మంగువాయి బాడవకు చెందిన తుర్రం జ్యోతి, విప్పు పువ్వుతో లడ్డూ, బర్ఫీ, చాక్లెట్, టీ తయారులతో ఆమె గిడుగు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఆమె వినూత్న ఆలోచన 35 మంది మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు, గిరిజన ఆహార సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.