SDPT: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని వర్గల్ గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులు పశువులను కసాయి ఖానాకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా గోవులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.