VKB: బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామంలోని 1వ వార్డులో ఎంపీ డీకే అరుణ సాకారంతో మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. 4వ వార్డు సభ్యుడు రాజు నాయక్ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ సహకారంతో గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.