SRPT: కోదాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ భాగ్యరాజ్ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. భాగ్యరాజ్ మృతదేహాన్ని టీపీపీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.