SRCL: వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మంగళవారం నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆర్డీవో రాధాబాయి చెక్కులు పంపిణీ చేశారు.