NLG: ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై గ్రామాలలో ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి పునరుద్ఘాటించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా మంగళవారం ఆమె చందంపేట మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు. గాగిల్లాపూర్లో సర్వే నిర్వహిస్తున్న ఇండ్లకు వెళ్లి సర్వేపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.