ASF: నిజామాబాద్ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి ఆదివారం విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి బేగంపేట్ ఎయిర్ పోర్టులో సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీష్ బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రతిపాదనలను వారి ముందు ఉంచడం జరిగిందని MLA పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.