NLG: దేవరకొండ పట్టణంలో చందంపేట మండలం నుంచి మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య ఆధ్వర్యంలో ఇవాళ పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరు’ అని అన్నారు.