BHPL: జిల్లా తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా అల్పసంఖ్యాక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. 5వ తరగతిలో ఎస్సీలకు 2, బీసీలకు 2 సీట్లు, ఇంటర్ ఫస్టియర్లో ఎంపీసీ/బైపీసీలకు ఓసీలకు 1, ఎస్టీలకు 1 సీటు ఖాళీగా ఉన్నాయని, ఈ నెల 31లోపు దరఖాస్తు చేయాలని కోరారు.