NLG: ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర ఆనాటి సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని డీఎస్పీ రాజశేఖరరాజు అన్నారు. ఆదివారం ఆయన జాతరను, క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని కోరారు.