పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు వద్ద గల కట్ట మైసమ్మ ఆలయానికి బాకం ఓం ప్రకాష్ సుమలత దంపతుల సహకారంతో చేపట్టిన స్టీల్ రీలింగ్ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ళ మల్లయ్య ఇవాళ ప్రారంభించారు. కట్ట మైసమ్మ దీవెనలు దాతలు, పట్టణ ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఓం ప్రకాష్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.