RR: ప్రజలకు మంచి పాలన అందించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జ్యోతిర్మయి అంజిని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి, ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలన్నారు.