MLG: తాడ్వాయి మండలంలో ఉన్న సమ్మక్క సారలమ్మ తల్లులను సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రులు, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.