MBNR: జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన నాలుగు తులాల వెండి, డబ్బు చోరీ కేసును వన్ టౌన్ పోలీసులు మంగళవారం చేదించారు. కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ జానకి ఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. చోరీ చేసిన వస్తువులను నిందితుడు రైచూర్లో అమ్మేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు చేసిన తనిఖీలలో పట్టుబడినట్లు వెల్లడించారు.