ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్కు కీలక బాధ్య తలు అప్పగించింది. నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్కు వీరిద్దరినీ పలు బూత్లకు ఇన్ఛార్జీలుగా నియమించింది.