BDK: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తుందని అయన పేర్కొన్నారు. యుక్త వయస్సు బాలికలకు ఎమ్మెల్యే స్వయంగా టీకాలు అందజేసి అవగాహన కల్పించారు.