SRPT: చింతలపాలెం మండల పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెల్లటూరు గ్రామ పరిధిలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలుడు ఇవ్వాళా ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి మృతి చెందాడు. మృతుడు వెంకట్రాంపురం గ్రామానికి చెందిన బాలుడిగా గుర్తించారు. సరదాగా గడపడానికి వచ్చి విగతజీవిగా మారడంతో బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.