NGKL: రాబోయే పండుగలను ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో జరుపుకోవాలని శుక్రవారం కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.