MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వివిధ గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను, ఏర్పాటుచేసిన బందోబస్తును మెదక్ టౌన్ సీఐ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. నిజాంపేట మండలంలోని నందగోకుల్, నస్కల్, రాంపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.