WGL: చారిత్రక ఓరుగల్లు కోటను కబ్జాల నుంచి కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి కోట, రాతి కోట, స్మారక చిహ్నాల పరిసర ప్రాంతాల్లో నూతన భవనాల నిర్మాణాల కోసం ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టడం వల్ల కాకతీయ రాజుల చరిత్ర కనుమరుగయ్యే ఆవకాశం ఉందని వారు ఆందొళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించాలని కోరారు.