MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్లోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయంలో దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. అర్చకులు పురుషోత్తమ చార్యులు వేద మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ కుంకుమ పూజలో మహిళా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.