WNP: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పాతపల్లికి చెందిన కిషోర్ కుమార్ (25) దుర్మరణం చెందాడు. సోమవారం సాయంత్రం అయ్యవారిపల్లె నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు సరోజినీ ఆసుపత్రికి, అనంతరం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.