BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.