నిజామాబాద్: ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో నేడు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము గతవారం రిలే దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. సమస్యలు పరిష్కారించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.