NLG: దేవరకొండ మండలం కొమ్మేపల్లిలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురిసిన వర్షానికి పాఠశాల చుట్టూ వరద చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. దీంతో పాములు, తేళ్లు, విషపురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరుతున్నారు.