NZB: జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఎన్సీసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కలకలం రేపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్లో ఒక్కశాతం ఎన్సీసీ కోటా రిజర్వేషన్ను గతంలో తీసివేశారని తెలిపారు.