HYD: ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఈ మేరకు సీతాఫల్ మండి చిలకలగూడలోని గాంధీ బొమ్మ దగ్గర బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ హాజరయ్యారు. మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు.