MDK: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మెదక్ జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ చూపి ఆరు రజత పతకాలు సాధించారు. పథకాలు సాధించిన రాథోడ్ రమేష్ (టెన్నిస్ సింగిల్స్, డబుల్స్), భవాని, వీణ, సుష్మ (కబడ్డీ)లను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించి, సన్మానించారు.