సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు స్వామి వారికి వెండి కిరీటాన్ని గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా స్వయంగా స్వామి వారికి కిరీట ధారణ చేసి పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినాన ప్రజలందరికీ అన్నింటా విజయం చేకూరాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు.